Andhra Pradesh Narendra Modi Tour: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ రాబోతున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా హాజరవుతున్నారు. ఈ నెలలోనే తిరుచానూరులో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి రానున్నారు. ఈ రెండు ముఖ్యమైన వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. వీఐపీల రాకతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ వేడుకలు రాష్ట్ర పండుగలా జరుగుతున్నాయి.