Kalvakuntla Kavitha in Medak: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు ఎవరైనా సరే ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని, లేదంటే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు. ఈసందర్బంగా కవిత మరోసారి హరీష్ రావు, బీఆర్ఎస్ అగ్ర నేతల మీద సంచలన ఆరోపణలు చేశారు. వీరంతా కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లాలో వైద్య సేవలు, సాగునీరు, పాడి రైతులకు న్యాయం జరగడం లేదని కవిత విమర్శించారు.