Major Theft in Malakpet: హైదరాబాద్ నగరంలో దొంగలు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఇక్కడకు ఉపాధి నిమిత్తం వచ్చిన వారు.. సందు చూసుకుని అందినకాడికి దండుకుని పరారవుతున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో నేపాలీల ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా మలక్పేటలో భారీ చోరి వెలుగు చూసింది. ఓ వ్యక్తి టూర్కి వెళ్లి వచ్చేలోపు అతడి ఇంట్లో ఉన్న రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి కాజేశారు కేటుగాళ్లు.