హైదరాబాద్లో మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈగల్ టీమ్ దర్యాప్తులో సూర్య అనే వ్యక్తి గోవా నుండి డ్రగ్స్ తెప్పించి, కొరియర్ ద్వారా పబ్లు, డాక్టర్లకు సరఫరా చేస్తున్నాడని తేలింది. ఆడవాళ్ల చెప్పుల్లో డ్రగ్స్ దాచి రవాణా చేసేవాడని తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఈగల్ టీమ్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.