మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఒక AI వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఆయన టైమ్ మెషిన్ ద్వారా దివంగత ప్రముఖులైన చాణక్యుడు, బుద్ధుడు, మదర్ థెరిసా, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాంతో సంభాషించినట్లు చూపించారు. ‘విజ్ఞానం పంచే విద్యాసంస్థలు నెలకొల్పి, రాజ్యాన్ని నిర్మించే విద్యావంతులను తయారు చెయ్యి’ అంటూ ఆ ప్రముఖులు మల్లారెడ్డికి సూచించారు. టైమ్ మిషన్ నుంచి బయటకొచ్చిన మల్లారెడ్డి, దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతానని ప్రతిజ్ఞ చేశారు.