ప్రస్తుతం చదువుకుని డిగ్రీలు సంపాదించిన వారు ఉన్నారు కానీ.. వారికి సరైన నైపుణ్యాలు లేవని మంత్రి వివేక్ వెల్లడించారు. అందుకే కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అత్యాధునిక ఈవీ టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి కోర్సులను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.