ఎప్పుడు వార్తల్లో ఉండే దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. టెక్కలి పోలీస్ స్టేషన్లో దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు. తనపైనా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పైనా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ టెక్కలి పోలీసులను దివ్వెల మాధురి ఆశ్రయించారు. జనసేన శ్రేణులు అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నాయన్న దివ్వెల మాధురి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తమ నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు.