పిలవని పేరంటానికి వెళ్లే వారికి తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరైనా సరే పిలవకుండా ఫంక్షన్కు వచ్చి.. దొరికిపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ వెల్లడించాడు. అంతేకాకుండా దీనికి చట్టపరంగా శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు.