మహబూబ్నగర్-డోన్ మధ్య డబ్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే, హైదరాబాద్ నుంచి డోన్ వరకు రైళ్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. డెమో, మెమో రైళ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా మహబూబ్నగర్, డోన్ మధ్య సుమారు 185 కిమీ మేర రెండో ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి, మరికొన్ని చకచకా జరుగుతున్నాయి.