మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని మూడు గ్రామాల్లో ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. జీనుగురాల, చౌదర్పల్లి, బస్వాయిపల్లి పరిధిలో 416.18 ఎకరాల భూమిని గుర్తించి సర్వేలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చర్చల తర్వాత ఈ ప్రాజెక్టుపై ముందడుగు పడింది. ఈ యూనిట్ ద్వారా స్థానిక యువతకు వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.