మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి.. పుణ్యస్నానానికి వచ్చి తండ్రీ కొడుకులు మృతి

1 year ago 13
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లింగాలగట్టు పాతాళగంగ వద్ద పుణ్యస్నానానికి వచ్చి తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. శివదీక్ష విరమణ కోసం వచ్చిన తండ్రీ కొడుకులు.. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ గోదావరి నదిలోకి దిగి ఐదుగురు యువకులు చనిపోయిన సంగతి తెలిసిందే.
Read Entire Article