మహానంది క్షేత్రం మహా శివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్బంగా మహానంది ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నా్యి. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది ఆలయంలో ఆర్జిత సేవలు, అభిషేకాలు, స్పర్శదర్శనాలు రద్దు చేశారు. ఈ విషయాన్ని మహానంది దేవస్థానం ఈవో వెల్లడించారు.