మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన ఒక పులి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. సొంత భూభాగం, తోడు కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల గుండా ప్రయాణిస్తూ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్ల వయసున్న ఈ పులి 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని.. మైనింగ్, అటవీ అడ్డంకుల వల్ల వెనక్కి వెళ్లలేక జనావాసాల వైపు వస్తోందని అంటున్నారు.