కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ముందుగా మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మహిళలు జీరో టికెట్ తీసుకునేందుకు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఒక వేళ ఆధార్ కార్డు లేకపోతే.. ఓటర్ ఐడీ కార్డు అయినా చూపిస్తే టికెట్ జారీ చేస్తున్నారు. అయితే వీటన్నింటికి సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టనుంది. తాజాగా మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసే మహిళలకు 16 అంకెలతో కూడి స్మార్ట్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.