దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయటంతో పాటు.. తాగునీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.