శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి.. భక్తులు భద్రత, గౌరవం, సౌకర్యవంతమైన దర్శనం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు రచించుకోవాలని.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.