Police Case Filed On Mahasena Rajesh: మహాసేన రాజేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, రాజేష్తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేష్ మాత్రం ఆ పోస్టులకు తనకు సంబంధం లేదన్నారు.