ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఓ మహిళకు గాయమైన విషయం తెలిసిందే. అయితే ఆ మహిళకు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. కొండపల్లి బొమ్మలు, లేఖను పంపించారు. అందులో బాధితురాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ మేరకు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సత్యప్రసాద్.. ఆ మహిళకు కానుక అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఆరోపణలను ఖండించారు. బాధితురాలు.. పవన్ పంపించిన కానుకపై సంతోషం వ్యక్తం చేసింది.