మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి మహిళలందరికీ ఈ స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. వేరే రాష్ట్రాల మహిళలు.. నకిలీ ఆధార్ కార్డులతో.. ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారని గుర్తించిన అధికారులు.. స్మార్ట్ కార్డుల ద్వారా ఈ నకిలీలను అడ్డుకోవచ్చని భావించి ఈ చర్యకు ఉపక్రమించారు.