ఏపీ బీసీ కార్పొరేషన్ మహిళలకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 46,994 మందికి త్వరలోనే ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో ఇప్పటి వరకూ 46,994 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని.. త్వరలోనే వారికి ఫ్రీగా కుట్టుమిషన్లు అందిస్తామని ఏపీ బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అనంతకుమారి శనివారం వెల్లడించారు.