గతేడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో 8,848 బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. అయితే, కొన్ని మార్గాల్లోని బస్సుల్లో ఈ పథకం వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా, సింహాచలం కొండపైకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది. దేవదేవుని కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు.