జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బలాన్ని పెంచుతూ.. మంత్రి సీతక్క మహిళల కోసం కీలక ప్రకటన చేశారు. మహిళా సంఘాలలో చేరిన ప్రతి మహిళకు ఉచితంగా రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తామని ఆమె ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ అజెండా అని స్పష్టం చేశారు. అలాగే.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇళ్ల కోటా అందిస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకుడు నవీన్ యాదవ్ని గెలిపించి, జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేయాలని సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు.