తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం వినూత్న పథకాన్ని ప్రకటించింది. ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళల చొప్పున 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సూచన మేరకు మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు.