Sri Saraswathi Vidya Peetham Sapta Shakti Sangam:మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విద్యాభారతి 'సప్తశక్తి సంగం' కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2026 జనవరి 23 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా 76 లక్షల మంది మహిళల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 24 వేల విద్యాలయాల్లో మాతృ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. భారతీయ ఆలోచనను ఇంటింటికీ చేరవేసి, 3.5 కోట్ల కుటుంబాలతో మమేకం కావడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.