అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ప్రసూతి సెలవులపై కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఇచ్చేవారని.. ఇకపై ఎంతమందిని కన్నా కూడా ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.