రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహంతో రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ అక్రమాలు, వేధింపులపై నిరసనగా చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు జోక్యం చేసుకోగా.. ఒక మహిళా కానిస్టేబుల్ విద్యార్థినితో వాగ్వాదం జరిపి ఆమెపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినులు ఆ కానిస్టేబుల్పై విరుచుకుపడ్డారు. “న్యాయం కోసం వచ్చిన మమ్మల్ని కొడతారా..?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి పరిష్కారం చూపే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.