సీఎంఈఆర్ఐ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మహిళా రైతులు సులభంగా నడిపేలా ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను అభివృద్ధి చేసింది. ‘సీఎస్ఐఆర్ ప్రైమా ఈటీ 11-కుశాల్’ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ట్రాక్టర్ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. రైతులకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగున్నర గంటల పాటు దున్నుతుంది. రహదారిపై ఆరు గంటల వరకు నడుస్తుంది. ఈ సాంకేతికతను హైదరాబాద్కు చెందిన కె.ఎన్.బయోసైన్సెస్కు బదిలీ చేశారు. త్వరలోనే ఇది రైతులకు అందుబాటులోకి రానుంది.