తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్న్యూస్ చెప్పారు. వడ్డీ లేని రుణాలు ప్రస్తుతం రూ.5 లక్షలు ఇస్తుండగా.. త్వరలోనే దాన్ని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దేశ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు వేగంగా సాధిస్తుందని చెప్పారు.