రాబోయే రోజుల్లో తెలంగాణ ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వమే స్థలం కేటాయించి ప్రతి మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకుంటామని చెప్పారు. 15-65 ఏళ్ల వయసు వారు మహిళా సంఘాల్లో ఉండాలే చర్యలు తీసుకుంటామన్నారు.