ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ముఖ్యంగా మేడారం జాతర టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆరోపించారు. ఈ విషయమై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.