మా తాతకి 3300 ఎకరాల భూమి ఉండేది.. నేనే 300 ఎకరాలు అమ్మేశా..: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

2 hours ago 1
తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణల నేపథ్యంలో రాజకీయ నాయకుల భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌, ఆయన కుటుంబం, సమీప బంధువుల పేరిట 439.30 ఎకరాల భూములు ఉన్నట్లు సీఎం వివరించారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సంబంధించిన పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన తాతకు 3,300 ఎకరాల భూమి ఉండేదని.. వారసత్వంగా తమకు వందల ఎకరాల భూములు వచ్చాయని చెప్పుకొచ్చారు.
Read Entire Article