సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన ఆరుగురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్కు కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన తండ్రి ఏ తప్పు చేయకున్నా.. కావాలనే తమ కుటుంబాన్ని ఇరికించారన్నారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.