ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిలో ఒకరికి ఉరిశిక్ష విధించగా.. మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ ఏ తప్పూ చేయలేదని తన కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కావాలనే తన కుటుంబాన్ని అమృత ఇరికించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.