మాజీ ఎంపీ హర్షకుమార్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్ట్ 15వ తేదీ జరిగిన ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. పంద్రాగస్టు సందర్భంగా రాజమండ్రిలో ఓ కాలేజీలో జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ హర్షకుమార్ పాల్గొన్నారు. అయితే జాతీయ గేయం వందేమాతరం ఆలపించే సమయంలో హర్షకుమార్ కుర్చీలోనే కూర్చుని ఉండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని.. అలాంటి వ్యక్తి నిలబడకపోతే ఏమవుతుందని మరికొంతమంది నెటిజనం మద్దతుగా నిలుస్తున్నారు.