ఇన్కం టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ లంచం కేసులో సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జీవన్ లాల్ మధ్యవర్తుల ద్వారా కోట్లలో లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన డెవలప్మెంట్ సంస్థ నుండి ఫ్లాట్, ఇతర సంస్థల నుం భారీగా నగదు లంచంగా తీసుకున్నాడు. జీవన్ లాల్కు మధ్యవర్తులు వ్యవహరించిన గోపాల్, సాయిరామ్, నరేంద్రల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.