Kodali Nani Notice: మాజీ మంత్రి కొడాలి నాని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై 2024లో ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లను సోషల్ మీడియాలో దూషించారని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు ఐటీ యాక్టులోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం పోలీసులు గుడివాడలో కొడాలి నాని ఇంటికి వెళ్లి 41 CrPC నోటీసులు ఇచ్చారు.. విచారణకు రావాలని ఆదేశించారు.