Peddireddy Forest Land Encroachment Video: మంగళంపేట అటవీ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్యాప్తునకు ఆదేశించారు. తూర్పు ఘాట్లలో 76.74 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని, దీనిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఆక్రమణదారుల పేర్లను వెబ్సైట్లో ప్రచురించాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.