తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్కు చెందిన సిబ్బందికి డబ్బులు చెల్లించడంలో మోసం చేశారంటూ యేసుబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.