Vidadala Gopinath Arrested: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారనే కేసులో ఈ అరెస్టు జరిగింది. విజిలెన్స్ తనిఖీల పేరుతో రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజినిని ఏ1గా, ఐపీఎస్ అధికారి జాషువాను ఏ2గా చేర్చారు. గోపికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు.