Andhra Pradesh Panchayats Rs 988 Crore Released: ఏపీ ప్రభుత్వం పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిధుల్ని విడుదల చేస్తోంది. ఇప్పటికే రూ.998.62 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ.988.76 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వం ఈ నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలు వచ్చాయి.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థలకు డబ్బుల్ని విడుదల చేస్తోంది.