డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని గత పర్యటనలో పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం.. ఆలయ అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయం వద్ద ప్రదక్షిణ మండపం, రహదారి సౌకర్యానికి నిధులు కేటాయించి శంకుస్థాపనలు చేశారు. అలాగే మాట ప్రకారం ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి 30 ఎకరాల భూమిని కేటాయించేలా పవన్ కళ్యాణ్ కృషి చేశారు.