ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఈ విరాళం అందించారు. అంతేకాదు, పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్ల కోసం సొంత నిధులతో సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. ఆదివారం 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేశారు.