ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అచ్చుతాపురం జంక్షన్లో రూ.243 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతుపై దృష్టి సారించలేదని విమర్శించారు. అనకాపల్లి- అచ్చుతాపురం నాలుగులైన్ల రోడ్డు త్వరలో వస్తుందని చెప్పి జిల్లా అభివృద్ధి పనులకు ప్రజల సహకారం కోరారు.