ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దూకుడుగా వ్యవహరిస్తూనే, ప్రజల సమస్యల పట్ల మానవత్వం చూపిస్తున్నారు. తాజాగా, వినికిడి లోపంతో బాధపడుతున్న లిఖితా శ్రీ అనే చిన్నారికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని ఆదేశించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక గతంలో కూడా క్యాన్సర్ బాధితుడు సాయిచరణ్కు రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజల్లో హర్షం కలిగిస్తున్నాయి.