ములుగును ఐటీ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. రూ.6 కోట్లతో ఐదు అంతస్తుల అత్యాధునిక ఐటీ భవనాన్ని నిర్మించనున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టాస్క్ సెంటర్లో ఐటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే సిరి ఇన్ఫోటెక్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఐటీ విప్లవం సృష్టించి వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.