తెలంగాణ రాష్ట్రంలో నకిలీల దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. రోజువారీ జీవితంలో ఉపయోగించే ఉప్పు, పప్పు, పసుపు, కారం, నూనె, బియ్యం, అల్లం వంటి నిత్యావసర వస్తువులు సహా.. తాగే నీళ్ల వరకు కూడా కల్తీ కనిపిస్తోంది. ఆహార నాణ్యత, భద్రత ప్రమాదంలో పడుతున్నాయి. ప్రభుత్వాలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం దాడులు చేస్తున్నా.. ఈ అక్రమ వ్యాపారం ఆగడం లేదు. తాజాగా ఓఆర్ఎస్ పాకెట్స్లో కూడా నకిలీ రాజ్య మేలుతోంది. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కల్తీ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.