తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి 1 నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.