సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ యువతిని మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బు గుంజారు. మొదట చిన్న మొత్తానికి మొదలై.. చివరికి రూ.1.45 లక్షలు వసూలు చేశారు. పరువు పోతుందన్న భయంతో బాధితురాలు డబ్బు చెల్లించినా వేధింపులు ఆగలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.