ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి 'మార్వాడీ గో బ్యాక్' ఉద్యమానికి పిలుపునిచ్చారు. మార్వాడీ వ్యాపారులు జీఎస్టీ కట్టకుండా, ఇక్కడ డబ్బులు సంపాదించి గుజరాత్, రాజస్థాన్కు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇది హిందూ సమాజాన్ని చీల్చడానికి జరుగుతున్న కుట్ర అని విమర్శించారు.