మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలైన దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేవ్ జీ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ జనరల్గా రాజిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. వీరితో పాటు మరో 16 మంది కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు.